దేశంలో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ)లకు రెక్కలొస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అమల్లోకి వచ్చాక డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్ల లాచింగ్స్ కంటే ఇన్వెంటరీ అమ్మకాల మీదే ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. ఎందుకంటే? ప్రాజెక్ట్ ప్రారంభిస్తే చాలు రెరాలో నమోదు, నాణ్యత, నిర్మాణ గడువు, నిర్వహణ ప్రతి అంశంలోనూ కఠినమైన నిబంధనలుండటంతో డెవలపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో 2017–18 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికం (క్యూ4)లో 890719 గృహాల ఇన్వెంటరీ ఉంటే 2018–19 క్యూ4 నాటికి 800438 గృహాలకు చేరాయి. అంటే ఏడాదిలో 10 శాతం తగ్గాయని ప్రాప్టైగర్.కామ్ ‘‘రియల్ ఎస్టేట్: 2018–19 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం (క్యూ4)’’ నివేదిక తెలిపింది.
అహ్మదాబాద్, చెన్నై మినహా..
అహ్మదాబాద్, చెన్నై మినహా అన్ని నగరాల్లో ఇన్వెంటరీ తగ్గింది. అహ్మదాబాద్లో 2018 క్యూ4లో 61683 గృహాలుండగా.. 2019 క్యూ4 నాటికి 63114 యూనిట్లకు, చెన్నైలో 37728 నుంచి 38226 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో 87110 నుంచి 77835 యూనిట్లకు, గుర్గావ్లో 47793 నుంచి 44046 గృహాలకు, కోల్కత్తాలో 48629 నుంచి 44689లకు, ముంబైలో 332719 నుంచి 288679లకు, నోయిడాలో 79605 నుంచి 65006లకు, పుణెలో 153182 నుంచి 141695లకు తగ్గాయి.