మలేసియా లోని బాగాన్ డత్తోలో శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మలేసియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండువగా సంప్రోక్షణ, స్వామి వారి కల్యాణ ఉత్సవం జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే దత్తో ఖైరుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే విధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 500 మంది తెలుగు వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సంఘం గౌరవ సలహాదారు దత్తో డాక్టర్ అచ్చయ్య కుమార్ రావు, అధ్యక్షులు డాక్టర్ వెంకట ప్రతాప్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ సత్య సుధాకర్, వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
