Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అంతర్జాతీయ దివ్యాంగుల సాధికార దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు

అంతర్జాతీయ దివ్యాంగుల సాధికార దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దివ్యాంగుల సాధికార అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఐఐటి ఇన్నోవేషన్ సెంటర్ ను స్థాపించి, అంధ విద్యార్థులను ప్రోత్సహించిన బెంగళూరుకి చెందిన విద్యాబాయికి రాష్ట్రపతి అవార్డును ప్రదానం చేశారు. అలాగే క్రీడా రంగంలో దివ్యాంగ యువతను ప్రోత్సహించిన మధ్యప్రదేశ్ కి చెందిన పూజా ఓఝాకు రాష్ట్రపతి అవార్డును అందించారు. వీరితో పాటు బిహార్ కి చెందిన వైష్ణవికి సర్వశ్రేష్ఠ పురస్కారాన్ని రాష్ట్రపతి ముర్ము అందజేశారు. ఇక.. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

Related Posts

Latest News Updates