Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బొగ్గులారీ… పల్టీలు కొట్టిన బస్సు… 40 మందికి గాయాలు

భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ–కొత్తగూడెం జాతీయ రహదారిపై ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 43 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైయ్యాయి. లారీ ఢీ కొట్టడంతో బస్సు మూడు పల్టీలు కొట్టింది. ఏప్రిల్ 30వ తేదీ ఆదివారం ఉదయం భద్రాచలం డిపో నుంచి ఓ ఆర్టీసీ బస్సు 47 మంది  ప్రయాణికులతో విజయవాడ బయల్దేరింది. కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం ఆనందగనికి వద్ద అతివేగంగా వచ్చిన లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో మెుత్తం ప్రయాణికుల్లో 43 మంది గాయపడ్డారు.

Related Posts

Latest News Updates