Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ… పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు… ఒకరు దుర్మరణం

సూర్యాపేట మునగాల దగ్గర ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. దీంతో రాజధాని బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటు ద్విచక్ర వాహనం, ఇటు ఆర్టీసీ బస్సు రెండూ పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. బస్సులో వున్న ప్రయాణికులంతా సురక్షితంగానే వున్నారు. ఈ రాజధాని బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతోంది. మియాపూర్ డిపోకు చెందిన బస్సుగా గుర్తించారు. మునగాల మండలం మొద్దుల చెరువు దగ్గర ఘటన జరిగింది. కాగా.. నిన్న ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న బస్సులో సైతం ప్రమాదం జరిగింది.

Related Posts

Latest News Updates