తెలంగాణలో ఆసక్తికర పరిణామం జరిగింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి, టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వైస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ అంశంపై కలిసి పోరాడదామని ఆహ్వానించారు. ఇందుకోసం ఓ ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేద్దామని, ప్రగతి భవన్ కి మార్చ్ పిలుపునిద్దామని వారికి సూచించారు. సీఎం కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలన్నారు. కలిసి పోరాడకుంటే ప్రతిపక్షాలను కేసీఆర్ బతకనివ్వరని అన్నారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు వుంటుందని అన్నారు. ఉమ్మడి పోరాటం చేసేందుకు త్వరలోనే సమావేశం అవుదామని షర్మిల పేర్కొన్నారు. అయితే.. దీనిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీలో నిర్ణయించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
