తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల పరిశీలన పూర్తయ్యే నాటికి నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే.. అందులో స్వతంత్ర అభ్యర్థిగా వున్న పాలమూరి కమల నామినేషన్ ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఎన్నిక ధ్రువీకరణ పత్రం స్వీకరణ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
