Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఏపీలో ఖాయిలాపడ్డ పరిశ్రమలకు ఈఆర్సీ భారీ ఊరట

ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి పరిశ్రమల నిర్వాహకులకు భారీ ఊరట కల్పించింది. నిర్వహణ భారంగా మారి, మూతపడ్డ పరిశ్రమలకు విద్యుత్ సర్వీసును తిరిగి కల్పించేందుకు కనిష్ఠ ఛార్జీలే వసూలు చేయాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. ఈ నిబంధన మార్చి 31 వరకు మాత్రమే వుంటుందని స్పష్టం చేసింది.

ఈ స్కీం కింద విద్యుత్ పునరుద్ధరణ చేసే పరిశ్రమల సమాచారం మూడు నెలలకోసారి తమకు అందివ్వాలని కూడా ఈఆర్సీ డిస్కంలను ఆదేశించింది. కోవిడ్ కారణంగా ఘోరంగా దెబ్బతిని, మూతపడ్డ పరిశ్రమలు మళ్లీ ఇప్పడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలోని జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాంటి పరిశ్రమలకు ఏపీఈఆర్సీ ఈ వెసులుబాటును కల్పిస్తోందని అధికారులు ప్రకటించారు.

Related Posts

Latest News Updates