Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఏపీ శాసనసభలో ఘర్షణ వాతావరణం… కొట్టుకున్న వైసీపీ, టీడీపీ సభ్యులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలాంజనేయ స్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సభలోనే కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. జీవో నెంబర్ 1 ని రద్దు చేయాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభలోనే బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సమయంలోనే టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టడాన్ని వైసీపీ సభ్యులు నిరసించారు. ఈ సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు పేర్కొంటున్నారు.

 

ఈ ఘటనపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ సభ్యులు దాడి చేశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జీవో 1 ని రద్దు చేయాలంటూ తాము వాయిదా తీర్మానం ఇచ్చామని, దానికి స్పీకర్ అంగీకరించలేదని పేర్కొన్నారు. దీనికి ప్రతిగా తాము పోడియం దగ్గరికి వెళ్లి, నిరసన వ్యక్తం చేశామన్నారు. తాము తప్పు చేస్తే స్పీకర్ చర్యలు తీసుకుని, సస్పెండ్ చేయాలన్నారు. కానీ… వైసీపీ ఎమ్మెల్యేలు గూండాల మాదిరిగా వచ్చారని మండిపడ్డారు. ఇంత దారుణంగా సభలోనే వైసీపీ ప్రత్యక్ష దాడికి దిగిందని విరుచుకుపడ్డారు.

Related Posts

Latest News Updates