Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

‘కాశ్మీర్ క్రిమినల్స్’ను రిలీజ్ చేసిన రాంగోపాల్ వర్మ

కాశ్మీర్ క్రిమినల్స్ వచ్చేస్తోంది. రావణ లంక ఫేమ్ బి.ఎన్.ఎస్. దర్శకత్వంలో జి.ఎ. రామారావు- హర్ష ఆరేటి మోహన్ వడ్లపట్ల సంయుక్తంగా నిర్మించిన కాశ్మీర్ ఫైల్స్ టైలర్ ను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. షూటింగ్ మొత్తమూ కశ్మీర్ లో జరిగింది. ఇలా కాశ్మీర్ లో మొత్తం షూటింగ్ కావడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు తుది దశలో వున్నాయని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పూర్తి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది.

మరో వైపు కాశ్మీర్ క్రిమినల్స్ చిత్ర యూనిట్ కు రామ్ గోపాల్ వర్మ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. తమ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసినందుకు చిత్ర యూనిట్ వర్మకు ధన్యవాదాలు తెలిపింది. మరో వైపు ఈ చిత్రానికి పీఆర్ఓగా ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను, విజువల్ ఎఫెక్ట్స్: చందు ఆది, కాశ్మీర్ షూటింగ్ కో-ఆర్డినేటర్: సన్నీ, కో-డైరెక్టర్: తేజ్ కుమార్, ఆర్.ఆర్: సుకుమార్, సినిమాటోగ్రఫీ: శివకృష్ణ, లైన్ ప్రొడ్యూసర్: నాగప్రియ, నిర్మాతలు: జి.ఎ. రామారావు-హర్ష ఆరేటి-మోహన్ వడ్లపట్ల (యు.ఎస్.ఎ), కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బి.ఎన్.ఎస్.రాజు ఉన్నారు.

Related Posts

Latest News Updates