Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

గుడ్ న్యూస్ : ఆధార్… ఓటర్ ఐడీ అనుసంధానం గడువు పెంపు

ఓటర్ కార్డుతో ఆధార్ ను అనుసంధానించే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకూ గడువును పెంచింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ ను జారీ చేసింది. గతేడాది జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఓటర్ కార్డుతో ఆధార్ ను అనుసంధానించే గడువు ఏప్రిల్ 1 తో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఓటర్లు ఫామ్ 6బీని సమర్పించాలి.

 

ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నాటికి 54.32 కోట్ల ఆధార్ సంఖ్యలను కేంద్రం సేకరించింది. కానీ.. వీటిని అనుసంధానించే ప్రక్రియను మాత్రం ప్రారంభించలేదు. ఓటర్ కార్డు కలిగిన వారు ఆన్‌లైన్‌లోనే ఈ ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు. లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కూడా లింక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇది తప్పనిసరి మాత్రం కాదు. స్వచ్ఛందం ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు.

Related Posts

Latest News Updates