Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తప్పు చేస్తే ఎవ్వర్నీ విడిచిపెట్టం… అదానీ విషయంపై అమిత్ షా

అదానీ హిండెన్ బర్గ్ వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదన్నారు. న్యాయ వ్యవస్థ ప్రక్రియపై అందరికీ నమ్మకం ఉండాలన్నారు. నిరాధారమైన ఆరోపణలను చేయకూడదని, అవి ఎంతో కాలం నిలబడవని చెప్పారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన కాంక్లెవ్ లో ఆయన మాట్లాడారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు, రుజువులు ఉన్నవారు ఈ కమిటీకి సమర్పించాలని చెప్పారు.

 

అదానీ వివాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు సెబీ అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలిపిందన్నారు. ఈ దర్యాప్తును కొనసాగించాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఏక కాలంలో రెండు దర్యాప్తులు జరుగుతున్నాయన్నారు. కోర్టుకు వెళ్లకుండా బయట విపక్ష నేతలు ఎందుకు నానా హంగామా చేస్తున్నారు? అంటూ అమిత్ షా ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పదేళ్ల పాలనలో ₹ 12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు, పరిస్థితిని ప్రశాంతంగా ఉంచడానికి ప్రభుత్వం సీబీఐ ద్వారా కేసు నమోదు చేసిందని అమిత్ షా గుర్తు చేశారు.

Related Posts

Latest News Updates