తెలుగు సబ్జెక్టు విషయంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి 10 వ తరగతి వరకూ తెలుగు సబ్జెక్టును తప్సనిసరిగా ఉండాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలు ఏర్పాట్లు చేయాలని, తగిన ఆదేశాలు కూడా ఇవ్వాలని సర్కార్ పేర్కొంది. అయితే.. తెలుగు బోధించని పాఠశాలలకు లక్ష రూపాయల వరకూ జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించింది.
