నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ-డ్రామా నేపథ్యంలో వస్తున్న మూవీ ‘తిరుచిత్రంబలం’. మిత్రన్ ఆర్ జవహర్ ఈ మూవీకి డైరెక్ట్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిణంలో సినిమా రూపొందుతోంది. కాగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల వివరాలను ప్రకటించింది సినిమా బృందం. నటి నిత్యా మీనన్, దర్శకుడు భారతీరాజా, నటుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు ప్రకటించారు.
