Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాశ్ రెడ్డి

వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసుకున్నారు. అవినాష్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3:45 నిమిషాలకు ముందస్తు బెయిల్ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్ పిటిషన్ లో అవినాశ్ రెడ్డి కీలక అంశాలను పేర్కొన్నారు. వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దస్తగిరి వాంగ్మూలం మేరకు తనను ఇరికించాలని సీబీఐ చూస్తోందన్నారు.

 

నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసే ఉద్దేశంలో సీబీఐ వుందని, ఆశ్చర్యంగా గూగుల్ టేకవుట్ డేటాను తెరపైకి తెచ్చిందన్నారు. ఒక వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేకవుట్ డేటా చెప్పలేదని, నాలుగేళ్లలో అనేక పరిణామాల తర్వాత తనను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ,ఒక వేళ అరెస్ట్ చేస్తే బెయిల్ పై విడుదల చేసేలా ఆదేశించాలని బెయిల్ పిటిషన్ లో అవినాశ్ కోరారు.

Related Posts

Latest News Updates