కృష్ణా జిల్లా అమీనాపురం గ్రామం నందు తానా ఫౌండేషన్, రోటరీ హాస్పిటల్ విజయవాడ సంయక్తముగా మెగా ఐ క్యాంపు నిర్వహించడం జరిగినది. సుమారు మూడువందల పైగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ కళ్ళ జోళ్ళు పంచారు. ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ పెద్దలు తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ మెగా ఐ క్యాంపు కార్యక్రమానికి అనిత యెర్నేని గారు స్పాన్సర్ చెయ్యడం జరిగినది. తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుడే ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.
