Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సిటీ పరిధిలోని చెరువులను అత్యాధునికంగా చేస్తాం : మంత్రి కేటీఆర్

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులతో GHMC పరిధిలోని 25 చెరువులు, HMDA పరిధిలోని 25 చెరువుల అభివృద్ది చేపట్టనున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే దుర్గం చెరువు టూరిస్ట్ స్పాట్ గా మారిందని అన్నారు. మరో 50 చెరువుల అభివృద్దికి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం జరిగిందని స్పష్టం చేశారు కేటీఆర్. నగరంలో చెరువుల బ్యూటిఫికేషన్,వాటి సంరక్షణ కోసం పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వివిధ నిర్మాణ రంగ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు ఒప్పంద ప‌త్రాల‌ను కేటీఆర్ అందించారు. హైద‌రాబాద్ రూపురేఖ‌లు మారిపోయాయ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ ప‌రిధిలో 155 చెరువులు ఉన్నాయి. దుర్గం చెరువు అభివృద్ధి చెందిన త‌ర్వాత టూరిస్టులు అధికంగా వ‌స్తున్నారు. సినిమా షూటింగ్‌లు కూడా చాలా అయ్యాయని మంత్రి గుర్తు చేశారు.

హైద‌రాబాద్ న‌గ‌రానికి 440 పైచిలుకు సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉందని, హైద‌రాబాద్‌లో 1908లో మూసీ న‌దికి వ‌ర‌ద‌లు వ‌చ్చిప్పుడు.. నాటి నిజాం మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య‌ను పిలిచి మాట్లాడారని, ఈ న‌గ‌రం బాగుండాలంటే.. భ‌విష్య‌త్‌లో వ‌ర‌ద‌ల ముప్పు రాకుండా స‌మ‌న్వ‌యం చేయాల‌ని ఇంజినీరింగ్ ప్ర‌ణాళిక ఇవ్వాల‌ని విశ్వేశ్వ‌ర‌య్య‌ను కోరారని గుర్తు చేశారు. ఆ క్ర‌మంలో వ‌చ్చిందే హిమాయాత్ సాగ‌ర్, ఉస్మాన్ సాగ‌ర్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

94 శాతం నీళ్లు గ్రావిటీ ద్వారా మూసీలో క‌లుస్తున్నాయని తెలిపారు. జులై నాటికి హైద‌రాబాద్‌లో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేస్తామని, దేశంలోనే వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే న‌గ‌రంగా హైద‌రాబాద్ నిలుస్తుంది అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైద‌రాబాద్ రూపురేఖ‌లు మారిపోయాయ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ ప‌రిధిలో 155 చెరువులు ఉన్నాయి. దుర్గం చెరువు అభివృద్ధి చెందిన త‌ర్వాత టూరిస్టులు అధికంగా వ‌స్తున్నారు. సినిమా షూటింగ్‌లు కూడా చాలా అయ్యాయన్నారు.

ఆఫీస్ స్పేస్ ఆక్యుపేష‌న్‌లో దేశంలోనే హైద‌రాబాద్ నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింద‌ని కేటీఆర్ గుర్తు చేశారు. ప్ర‌పంచానికే వ్యాక్సిన్ క్యాపిట‌ల్‌గా హైద‌రాబాద్ మారిందని, ఫార్మా సిటీ ప్రారంభ‌మైతే ప్ర‌పంచ ఫార్మా న‌గ‌రంగా మారుతుందని వివరించారు. శాంతిభ‌ద్ర‌త‌లు, ప‌రిపాల‌న బాగుండ‌టం వ‌ల్లే భారీగా పెట్టుబ‌డులు వ‌చ్చాయిన్నారు. 2030 క‌ల్లా 250 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయికి హైద‌రాబాద్ ఫార్మా ఇండ‌స్ట్రీ చేరుతుందని, హైద‌రాబాద్‌లో వ‌ర‌ల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీని రాచకొండ‌లో నిర్మిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

Related Posts

Latest News Updates