పుష్ప సినిమాతో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బాగా బిజీ వున్నాడు. అయితే… ఆయన తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన వెలువడింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా… అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రాబోతోంది.
Brace yourselves for this massive collaboration between three powerhouses of India – Producer Bhushan Kumar, Director Sandeep Reddy Vanga and superstar Allu Arjun.@alluarjun @imvangasandeep #BhushanKumar #KrishanKumar @VangaPranay @VangaPictures #ShivChanana @NeerajKalyan_24 pic.twitter.com/xis8mWSGhl
— T-Series (@TSeries) March 3, 2023
ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ బ్యానర్పై రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని టీ సిరీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి ప్రస్తుతం రణబీర్ కపూర్ తో యనిమల్ మూవీని తెరకెక్కించే బిజీలో వుండగా…. అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ షూటింగ్ లో బిజీగా వున్నాడు.