Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఘనంగా ముగిసిన ఆటా మహా వేడుకలు….

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) వాషింగ్టన్‌ డీసీ నగరంలో నిర్వహించిన ఆటా 17వ తెలుగు మహాసభల సంబరాలు ఘనంగా ముగిశాయి. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ పాల్గొన్న ఈ కార్యక్రమంలో 15,000 మంది కి పైగా పైగా పాల్గొనటం ఒక విశేషం. జులై 1 వ తారీఖున నిర్వహించిన బాంక్వేట్‌ డిన్నర్‌ లో 3000 మందికి పైగా పాల్గొన్నారు. వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ ఆటా అవార్డ్స్‌ ప్రధానం చేసారు. క్రికెట్‌ దిగ్గజాలు కపిల్‌ దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌, క్రిస్‌ గేల్‌ తదితరులు ఈ బాంక్వేట్‌ డిన్నర్‌ లో పాల్గొన్నారు, వీరిని ఆటా ఘనంగా సత్కరించింది. అదే రోజు నిర్వహించిన గోల్ఫ్‌ టోర్నమెంట్‌ లో కపిల్‌ దేవ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సద్గురు జగ్గీ వాసుదేవ్‌ పాల్గొన్నారు. బతుకమ్మ పుస్తకాన్ని కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.

వద్దిపర్తి పద్మాకర్‌ గారు నిర్వహించిన అవధానం ఎంతో మందిని విశేషంగా ఆకట్టుకున్నది. శివమణి, థమన్‌ మ్యూజికల్‌ నైట్‌ శ్రోతలను ఉర్రుతలుగించింది. ఉపాసన కామినేని సద్గురు కి వినూత్నమైన ప్రశ్నలు శ్రోతల తరపున అడిగారు. సద్గురు మాట్లాడుతూ పర్యావరణ ముప్పుని నివారించటానికి సారవంతమైన భూమిని ఎలా కాపాడుకోవాలో, ఆహార భద్రతకు దీని ఆవశ్యకత, ఎంత ప్రాముఖ్యం సంతరించుకుందో సోదాహరణంగా ‘‘సేవ్‌ ది సాయిల్‌’’ ప్రోగ్రాం గురించి వివరించారు.
ఆటా మొదటి రోజు సాహిత్య కార్యక్రమాల ప్రారంభ సమావేశంలో ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్‌, అఫ్సర్‌, కసిరెడ్డి వెంకట రెడ్డి, ప్రభావతి, స్వామి వెంకటయోగి సమకాలీన సాహిత్యం గురించి మాట్లాడారు. ఆ తర్వాత, జొన్నవిత్తుల తన పారడీ పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

 

జులై 3 వ తారీఖున ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన లోక కళ్యాణం కోసం నిర్వహించిన శ్రీనివాస్‌ కళ్యాణం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు, తీర్ధ ప్రసాదాలు అందుకున్నారు.

ఆటా బ్యూటీ పేజంట్‌ విజేతలకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అడివి శేష్‌ బహుమతులు అందచేశారు. అమెరికాలో 12 నగరాల నుంచి ఔత్సాహికులు పాల్గొనటం విశేషం.
రaుమ్మంది నాదం పాటల పోటీలలో మరియు సయ్యంది పాదం నృత్యపోటీలలో పాల్గొన్న మూడు వందల మందిలోని నుండి విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందచేశారు. బిజినెస్‌ కమిటీ నిర్వహించిన ఎంట్రప్రెన్యూర్‌ షిప్‌ అండ్‌ లైఫ్‌ సైకిల్‌ కార్యక్రమంలో జిఎంఆర్‌ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున రావు పాల్గొన్నారు. ఉమెన్‌ ఎంపవర్మెంట్‌ సదస్సులో ఉపాసన కామినేని పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి పై నిర్వహించిన సదస్సులో తనికెళ్ళ భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

 

ఈ మహాసభలలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, మల్ల రెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ళ వేంకటేశ్వర రెడ్డి , గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొళ్ళం మల్లయ్య యాదవ్‌ , గాదారి కిశోర్‌, వైజాగ్‌ పార్లమెంట్‌ సభ్యులు సత్యనారాయణ, రాజమండ్రి శషన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌధరి మరియు ఇతర నాయకులు భాను ప్రకాష్‌ రెడ్డి, పటేల్‌ రమేశ్‌ రెడ్డి, భవానీ మారికంటి, మన్నవ సుబ్బ రావు తదితర నాయకులు పాల్గొన్నారు. రామచంద్ర మిషన్‌ ధ్యాన గురువు కమలేష్‌ పటేల్‌( దాజి) ప్రత్యేక సందేశం అందించారు.

 

మాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరి అందరిని మైమరిపించి మధురానుభూతులను అందించింది. గురువందనతో సంగీత విభావరి ప్రారంభమై ఎన్నో అద్భుతమైన పాటలను మనో, కార్తీక్‌ లాంటి ప్రముఖ గాయని గాయకులు అంధింస్తు సంగీతాల రaురిలో వోలాలడిస్తు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
ఆటా ప్రెసిడెంట్‌ భువనేశ్‌ బుజాల మాట్లాడుతూ ఆటా మహాసభలు విజయవంతానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు.

Related Posts

Latest News Updates