Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఊర్లనే వుంటావా? ఊర్లు పట్టుకొని తిరుగుతావా? సంజయ్ ఘాటు ట్వీట్

తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రెండు రోజుల పాటు ప్రధాని మోదీ హైదరాబాద్ లోనే వుంటున్నారని, మరి ఊర్లనే వుంటవా? ఊర్లు పట్టుకొని తిరుగుతావా? అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి బండి సంజయ్ ఘాటు ట్వీట్ చేశారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ప్రభుత్వం తరపున స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లడం లేదు. సీఎం కేసీఆర్ కు బదులుగా మంత్రి తలసాని ఆ బాధ్యతలను మోస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను దెప్పిపొడుస్తూ ట్వీట్ చేశారు.

Related Posts

Latest News Updates