మునావర్ ఫారుఖీ షోను అడ్డుకుంటామనడంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను లాలాగూడ పోలీస్స్టేషన్కు తరలించారు. శనివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లో మునావర్ ఫారుఖీ షో నిర్వహించనున్నారు. బుక్ మైషోలో మొత్తం టికెట్లను నిర్వాహకులు విక్రయించారు. వేదికను తగలబెడతామని ఇప్పటికే బీజేవైఎం, రాజాసింగ్ హెచ్చరించారు. దీంతో మునావర్ ఫారుఖీ కామెడీ షోపై సస్పెన్స్ కొనసాగుతోంది. శిల్పకళా వేదికను రేపటికి నిర్వాహకులు బుక్ చేసుకున్నారు. ఇప్పటివరకు అడ్వాన్స్ అమౌంట్ నిర్వాహకులు చెల్లించలేదు. కామెడీ షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని మునావర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో అనుమతి ఇవ్వొద్దంటూ బీజేవైఎం నేతలు డీజీపీని సైతం కలిశారు. అయినా కూడా ఈ షోకు అనుమతి లభించింది.
