Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

గురువారం విచారణకు రాలేను… ఈ నెల 15 అయితే… ఓకే.. ఈడీకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులిచ్చింది. గురువారం విచారణకు హాజరవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ… ఈడీకి లేఖ రాశారు. గురువారం విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 15 న విచారణకు హాజరవుతానని తెలిపారు. 10 న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని, అలాగే ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు కూడా వున్నాయని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే…. కవిత రాసిన లేఖ విషయంలో ఈడీ ఇంకా స్పందించలేదు. కవిత పేర్కొన్నట్లు ఈ నెల 15 వరకూ ఈడీ ఆగుతుందా? లేక… గురువారమే విచారణకు హాజరు కావాలని సూచిస్తుందా అన్నది మాత్రం వేచి చూడాలి.

 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు పంపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (mlc kavitha) స్పందించారు. తనకు ఈడీ నోటీసులు అందాయని, ఈడీకి పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. అయితే… ముందస్తు షెడ్యూల్ ప్రకారం కొన్ని అపాయింట్స్, కార్యక్రమాలు వున్నాయని, రేపటి విచారణకు హాజరు కావాలా లేక నోటీసులపై లేఖ రాయాలా అనేది న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మార్చి 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ లో మహిళా బిల్లు కోసం దీక్ష చేపట్టామని.. ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు.

 

ఢిల్లీలో దీక్ష కోసం మార్చి 8వ తేదీనే ఢిల్లీ వెళ్లాల్సి ఉందని.. అయితే ఈలోపే ఈడీ నోటీసులు రావటంతో.. ముందస్తు కార్యక్రమాలపై పార్టీలోనూ.. న్యాయ నిపుణులతోనూ చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని, దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతామని కవిత స్పష్టం చేశారు.

Related Posts

Latest News Updates