Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

వివేకా హత్య కేసు : వైఎస్ భాస్కర్ రెడ్డికి మరోసారి నోటీసులిచ్చిన సీబీఐ అధికారులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు రావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులిచ్చింది. సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం పులివెందులలోని భాస్కర్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లి, నోటీసులు అందజేశారు.

 

ఈ నెల 12 న విచారణకు రావాలని సూచించారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌజ్ లేదా… హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాలని సూచించింది. అయితే… గత నెల 18 న విచారణకు రావాలని వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులిచ్చింది. అయితే… ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలతో విచారణకు రాలేకపోతున్నానని పేర్కొన్నారు. దీంతో ఈ నెల 12 న విచారణకు రావాలని సీబీఐ మరోసారి నోటీసులిచ్చింది.

Related Posts

Latest News Updates