Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

భోగాపురం ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన

భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు మే 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. మొదటి దశలో జీఎంఆర్ గ్రూపు భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయనుంది. తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా భోగాపురం ఎయిర్ పోర్టును రూపుదిద్దనున్నారు. సీఎం జగన్ మే 3వ తేదీన విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న సభాస్థలిని ఆమె జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి పరిశీలించారు.

Related Posts

Latest News Updates