ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఉదయం 10:30 నిమిషాలకు ఆయన ప్రధానితో భేటీకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు పెండింగ్ సమస్యలను ప్రధానితో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల మేరకు నిధుల విడుదల, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, నిధుల విడుదల గురించి చర్చిస్తారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని, భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్లు మంజూరు చేయాలని, ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని కూడా సీఎం జగన్ కోరనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు ఆదివారం రాత్రి సీఎం జగన్ అమరావతి నుంచి ఢిల్లీకి బయల్దేరారు. అధికారిక నివాస గృహం జన్పథ్ 1కు చేరుకున్నారు. ఇక.. ప్రధాని రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో కూడా భేటీ అవుతున్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అవుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను కేంద్ర మంత్రులతో చర్చిస్తారు.