Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ప్యారిస్ పర్యటన ముగించుకొని ఏపీకి చేరుకున్న సీఎం జగన్

ప్యారిస్ పర్యటన ముగించుకొని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో మంత్రి జోగి రమేశ్, సీఎస్, తదితరులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన నేరుగా తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ దంపతులు చేరుకున్నారు.

సీఎం జగన్ దంపతులు కుమార్తె హర్ష గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ వేడుకల్లో పాల్గొనడానికి సీఎం జగన్ దంపతులు ప్యారిస్ వెళ్లారు. అక్కడి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమార్తె హర్షతో జగన్ దంపతులు ఫొటోలు కూడా దిగారు. ఈ విజయాన్ని చూసి తామెంతో గర్వపడుతున్నామని సీఎం జగన్ ట్వీట్ కూడా చేశారు.

”డియర్ హర్ష… నీ అద్భుతమైన ఎదుగుదలను చూస్తే ఎంతో గర్వంగా వుంది. నీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి. ఈ రోజు ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి డిస్టింక్షన్ లో పాస్ కావడమే కాకుండా.. డీన్స్ లిస్టులో నీ పేరు చూసి ఎంతో గర్వపడుతున్నాను. భవిష్యత్తులో భగవంతుడు నీకు అన్ని విధాలుగా తోడు నిలవాలని కోరుకుంటున్నా” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Related Posts

Latest News Updates