Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్… దేశపతికి ఛాన్స్

శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్య గారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో… ఎమ్మెల్సీ అభ్యర్థుల ఉత్కంఠతకు తెరపడినట్లైంది. ఈ నెల 9 న ఈ ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

 

కాగా… రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు. చాలా రోజులుగా ఎమ్మెల్సీ ఛాన్స్ దేశపతికి ఇస్తారని బాగా ప్రచారం జరిగింది. కానీ… రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. అంతేకాకుండా దేశపతి శ్రీనివాస్ ప్రస్తుతం CMO లో బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. చివరికి… ఎమ్మెల్యే కోటాలో దేశపతి శ్రీనివాస్ కి ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశమిచ్చారు.

Related Posts

Latest News Updates