Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మునుగోడు విజయానికి అందరూ కలిసి పనిచేయాలి : సీఎం కేసీఆర్

మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ విజ‌యానికి అంద‌రూ క‌లిసి ప‌ని చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి విజ‌యానికి కృషి చేయాల‌ని టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర న‌ర్స‌య్య గౌడ్, ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్‌కు కేసీఆర్ సూచించారు. భ‌విష్య‌త్‌లో జాతీయ‌, రాష్ట్ర రాజ‌కీయాల్లో నేత‌లంద‌రికీ అవ‌కాశాలు వ‌స్తాయ‌ని సీఎం పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సూచ‌న మేర‌కు కూసుకుంట్ల గెలుపు కోసం కృషి చేస్తామ‌ని న‌ర్స‌య్య గౌడ్, ప్ర‌భాక‌ర్ తెలిపారు.

 

మునుగోడులో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ అన్నారు. ఉదయం క్యాంప్ ఆఫీస్ లో మునుగోడు ముఖ్య నేతలు సీఎం కేసీఆర్ ను కలిశారు. బై పోల్లో టిక్కెట్ కోసం బూర నర్సయ్యగౌడ్, కర్నె ప్రభాకర్ తీవ్రంగా యత్నించారు. టిక్కెట్ ను ఆశించడంలో తప్పు లేదని.. అయితే తన అవసరం జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా ఉందని కేసీఆర్ చెప్పినట్టు బూర నర్సయ్యగౌడ్ వివరించారు. అధినేత ఆదేశాలను పాటిస్తామని బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. మరోవైపు మునుగోడు టీఆర్ఎస్ లో అంసతృప్తి లేదని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు.

Related Posts

Latest News Updates