Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పారిశ్రామిక రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది – డైరెక్టర్ కార్తికేయ

పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది – డైరెక్టర్ కార్తికేయ
పా రిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రమ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోన్నదని మరింత అభివృద్ధికి, అవసరమైన కార్యక్రమాలు, నిర్ణయాలు తీసుకోవడానికి భారత ప్రభుత్వ రంగ సంస్థ , నేషనల్ స్మాల్ ఇండస్ట్రిస్ కార్పొరేషన్ , (NSIC, )నిబద్దతతో ఉన్నదని ,ఆ సంస్థ డైరెక్టర్ శ్రీ. కార్తికేయ సిన్హా, హైద్రాబాద్ లో తెలియజేసారు.

ఉభయ తెలుగు రాష్ట్రాలలోని, ఆ సంస్థ హైద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం బ్రాంచిల కార్యక్రమాల, సమీక్ష కోసం గురువారం రోజున హైదరాబాద్ నగరం విచ్చేసిన కార్తికేయ సిన్హా, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ మార్కెటింగ్ )మరియు గౌరవ్ గులాటి, , డైరెక్టర్ (ఫైనాన్స్, )ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ పారిశ్రామిక సంస్థల సమావేశంలో ప్రతినిధుల కు, ఎన్. ఎస్. ఐ. సి కార్యక్రమాలను విశదీకరించారు.

ఈ సమావేశంలో కాంఫేడేరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ పెనుర్స్ , ( కోవే-ఇండియా) , అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రిన్యూర్స్, ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్త్రీ (ఎఫ్. టి. సి. సి.ఐ), బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, లగు ఉద్యోగ్ భారతి, జీడిమెట్ల ఇండస్ట్రిస్ అసోసిషన్, బాలానగర్ మైక్రో & స్మాల్ ఇండస్ట్రిస్ అసోసియేషన్ ల ప్రతినిధులు ఆసక్తిగా
పాల్గొని, ఉభయ రాష్ట్రలలో చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూలంకుశoగా చర్చించారు.
ఈ సమావేశంలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రిస్ కార్పొరేషన్, జోనల్ హెడ్ శ్రీ కె. శ్రీనివాస్ మరియు సీనియర్ బ్రాంచ్ మానేజర్ శ్రీ. ఎస్. సురేష్ లు, శ్రీ వీరభద్రరావు, శ్రీ సోమశేఖర్, శ్రీ అశ్విని కుమార్ పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates