ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ లేఖ రాశారు. కొన్ని రోజులుగా రష్యాతో యుద్ధంలో తలపడుతున్నామని, ఈ నేపథ్యంలో తమకు మానవతా సాయం కావాలని జెలెన్ స్కీ ఆ లేఖలో అభ్యర్ధించారు. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ లేఖను భారత విదేశాంగ అధికారులకు జపరోవా అందజేశారు.
Not a time for War- PM @narendramodi
Pleased to meet Ukrainian First Dy FM @EmineDzheppar. Exchanged views on bilateral & global issues of mutual interest. Cultural ties & women empowerment also figured in the discussion. Ukraine was assured of enhanced humanitarian assistance. pic.twitter.com/YmzQ6o7LbG
— Meenakashi Lekhi (@M_Lekhi) April 11, 2023
అయితే… ఉక్రెయిన్ కి మానవతా సాయం అందించేందుకు సిద్ధమని భారత విదేశాంగ శాఖా సహాయ మంత్రి మీనాక్షి లేఖి ప్రకటించారు. ఉక్రెయిన్ కి వైద్య సామాగ్రి వంటి అదనపు సాయం అందిస్తామన్నారు. తమ దేశంలో మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడం భారతీయ కంపెనీలకు కూడా అవకాశంగా వుంటుందన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన కూడా తొలిగిపోయే అవకాశాలున్నాయని జెలెన్ స్కీ తన లేఖలో పేర్కొన్నారు.