Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు.. విచారణకు రావాలంటూ ఆదేశాలు

అటు రెబెల్స్, ఇటు శివసేన మధ్య జరుగుతున్న జంఝాటంలో మరో ట్విస్ట్ జరిగింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో రౌత్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ప్రశ్నించాల్సి వుందని ఈడీ కార్యాలయం పేర్కొంది. మంగళవారం తమ ఎదుట హాజరు కావాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

పాత్రా చావ్లా భూ అవినీతికి సంబంధించి, 1,034 కోట్ల అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. దీనిలో రౌత్, ఆయన కుటుంబీకులకు చెందిన 11.15 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ ఏప్రిల్ నెలలోనే జప్తు చేసింది. గతంలోనూ రౌత్ కు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నాకు ఈడీ సమన్లు జారీ చేసిందని ఇప్పుడే తెలిసింది. మంచిదే. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మలుపులు తిరుగుతున్నాయి. బాలా సాహేబ్ వారసులం పెద్ద యుద్ధమే చేస్తున్నాం. నన్ను ఆపడానికి ఇదో కుట్ర. నా తల నరికినా.. గౌహతి మార్గంలో వెళ్లను అంటూ రౌత్ ట్వీట్ చేశారు.

Related Posts

Latest News Updates