Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా…. షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈమేరకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక.. తెలంగాణలో ఒక ఉపాధ్యాయ, ఒక స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న సభ్యుల పదవీ కాలం మార్చి 29 తో ముగిసిపోనుంది. ఏపీలోని ప్రకాశం-నెల్లూరు- చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం- విజయనగరం- విశాఖ పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

 

దీంతో పాటు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ స్థానాల్లో ఈసీ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా కడప, నెల్లూరు. తూర్పు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఇక… తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ స్థానంతో పాటు హైదాబాద్ స్థానిక సంస్థల స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి.

Related Posts

Latest News Updates