వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కీలక ప్రకటన చేశారు. ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలని తాము భావించడం లేదన్నారు. దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదన్నారు. విశాఖపట్నంలోని కళావాణి స్టేడియంలో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగానే పై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను బలోపేతం చేసే పనిలో వున్నామని, స్టీల్ ప్లాంట్ లో కొన్ని కొత్త విభాగాలను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.
ముడిసరుకు పెంపొందించే ప్రక్రియపైనే నడుస్తున్నామని, పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియ జరుగుతోందన్నారు. RNIL యాజమాన్యం, కార్మిక సంఘాలతో ఈ పరిస్థితిపై చర్చిస్తామని కులస్తే ప్రకటించారు. అయితే… విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కూడా కేంద్ర మంత్రి ఫగ్గన్ కులస్తే స్పందించారు. అదో ఎత్తుగడ మాత్రమే అని కొట్టిపారేశారు.