Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత

మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వట్టి వసంత్ కుమార్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కిడ్నీ మార్పిడితో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన,  హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వట్టి వసంత్కుమార్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పూండ్ల గ్రామం. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు శాసనసభ సభ్యుడిగా వట్టి వసంతకుమార్ పని చేశారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో, అనంతరం రోశయ్య కేబినెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా కొనసాగారు. ఉమ్మడి ఏపీ ఆఖరి సీఎం కిరణ్కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పర్యాటకశాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మూడేళ్ల క్రితమే వసంత్ కుమార్ భార్య చనిపోయింది. వారికి పిల్లలు లేకపోవడంతో బంధువుల అబ్బాయిని దత్తత తీసుకున్నారు.

Related Posts

Latest News Updates