మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి లండన్ లోని ఇండియా యూకే అచీవర్స్ హానర్స్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఆర్థిక, రాజకీయ రంగాల్లో మన్మోహన్ సింగ్ చేసిన సేవలకు గుర్తింపుగా భారత్- బ్రిటన్ విజేతల సంఘం ఈ అవార్డును బహూకరించనుంది. బ్రిటన్ లోని భారత విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం (NISAU) త్వరలోనే ఢిల్లీ వేదికగా మన్మోహన్ కి ఈ అవార్డు ప్రదానం జరుగుతుందని పేర్కొన్నారు. బ్రిటిష్ యూనివర్శిటీల్లో చదువుకుని జీవితంలో ఘన విజయాలు సాధించిన భారతీయులకు లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ పురస్కారం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.బ్రిటిష్ కౌన్సిల్ ఇన్ ఇండియా, డిపార్టుమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (డిఐటి) భాగస్వామ్యంతో ఇండియా యూకె అచీవర్స్ హానర్స్ ఈ అవార్డును ఇవ్వబోతోంది. తనకు ఇంతటి ప్రఖ్యాత అవార్డు ఇస్తున్నందుకు చాలా ఆనందంగా వుందన్నారు.