Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

దుబాయిలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు

మహాశివరాత్రిని పురస్కరించుకుని దుబాయిలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బర్ దుబాయిలోని శివమందిరంతో పాటు, నూతనంగా ప్రారంభమైన జబల్ అలీ హిందూ ఆలయంలో కూడా పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు వచ్చి పూజలు చేసారు. ఈ రెండు దేవలయాలే కాకుండా కొన్ని సంఘాలు కూడా ప్రత్యేకంగా మహారుద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారు జామున నాలుగు గంటలకు మహా గణపతి హోమంతో అంకూర్పణ జరిగిన కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకు మహాశివరాత్రి పూజతో ముగిసింది. మస్కట్‌లోని  శివమందిరం, బహ్రెయిన్‌లోని  ఆలయంలో కూడా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.  శివరాత్రి పర్వదినాన్ని మాతృభూమిలో జరుపుకున్నంత సంతోషంగా ఉందని దుబాయిలో నివసించే నిజామాబాద్ జిల్లాకు చెందిన బంటి వంశీ గౌడ్ వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామానికి చెందిన బత్తిన భూమేశ్ గౌడ్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

Related Posts

Latest News Updates