Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తనకు ఆహ్వానం రాలేదు… వచ్చి ఉంటే వెళ్లేదాన్ని : తమిళిసై

అంబేద్క‌ర్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌కు త‌న‌ను ఆహ్వానించ‌లేద‌న్నారు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై హాజరుకాలేదు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ఓ కార్యక్రమంలో తమిళిసై మాట్లాడుతూ  తాను ఎందుకు హాజరుకాలేదనే దానికి వివరణ ఇచ్చారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తనకు ఆహ్వానం రాలేదని అన్నారు. పిలిచి ఉంటే వెళ్లేదాన్నని చెప్పారు. అంబేద్కర్ ఎక్కువగా మహిళల గురించి, మహిళా హక్కుల గురించి మాట్లాడారని, అలాంటి వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఒక మహిళా గవర్నర్ కి ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యమని చెప్పారు. అందుకే రాజ్ భవన్ లోనే అంబేద్కర్ కు నివాళులు అర్పించానని తెలిపారు. గ్రహాల మధ్య సూర్యుడు ఉన్నట్లు,  కొంత మంది రాజకీయ నాయకులు వారి కొడుకులను మధ్యలో ఉంచాలని అనుకుంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విగ్రహావిష్కరణకు అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అథిదిగా హాజరైన విషయం తెలిసిందే.

Related Posts

Latest News Updates