Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 100కి పైగా సీట్లు మావే

మహారాష్ట్రలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఉద్దవ్‌ థాక్రే కనీసం వంద సీట్లు అయినా గెలుచుకుంటారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. కేవలం ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన తమకు ఓటర్లు దూరమైనట్లు కాదని అన్నారు. మహారాష్ట్ర ప్రజల్లో తిరుగుబాటు ఎమ్మెల్యేల మీద తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను (ఈడీ, సీబీఐలను ఉద్దేశిస్తూ) డబ్బును అడ్డం పెట్టుకుని శివ సేనకు హస్తగతం చేసుకోలేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు మధ్యంత ఎన్నికలు పెట్టినా ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని శివ సేన 100 సీట్లకు పైగా గెలుచుకుంటుంది. ఉద్దవ్‌ థాక్రేపై ప్రజల్లో సానుభూతి ఉంది. అదే సమయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహం ఉంది. ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ నుంచి వెళ్లిపోతే శివ సేన తమ ఓటర్లను కోల్పోయినట్లు కాదు అని సంజయ్‌ పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates