Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

డబ్బుల ఏటీఎం లాగే… ఇప్పుడు గోల్డ్ ఏటీఎం… దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్ లో ఏర్పాటు

ఏటీఎంలో నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుంటున్నట్లే… ఇకపై బంగారాన్ని కూడా ఏటీఎమ్ నుంచి డ్రా చేసుకోవచ్చు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా గోల్డ్ ఏటీఎం ఏర్పాటైంది. వినియోగదారులు తమ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి, ఏటీఎమ్ నుంచి స్వచ్క్ష్మైన బంగారు నాణెలను తీసుకోవచ్చు. హైదరాబాద్ బేగంపేటలో ఈ గోల్డ్ ఏటీఎంను తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

వినియోగదారులు 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకూ బంగారు నాణెలను ఈ ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. బంగారం బరువును తెలిపే ధ్రువీకరణ పత్రం కూడా తీసుకోవచ్చు. అయితే.. డబ్బుల ఏటీఎం ఎలాగైతే.. 24 గంటలూ అందుబాటులో వుంటుందో… ఈ బంగారం ఏటీఎం కూడా 24 గంటలూ అందుబాటులో వుంటుంది. హైదరాబాద్ లోని మరికొన్ని ప్రాంతాల్లో, వరంగల్ తదితర ప్రాంతాల్లోనూ రాబోయే రోజుల్లో అందుబాటులోకి తేనున్నారు.

Related Posts

Latest News Updates