తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావుకు మరో అంతర్జాతీయ సమావేశానికి ఆహ్వానం అందింది. అక్టోబర్ 4వ తేదీన స్విడ్జర్లాండ్ రాజధాని జ్యూరీక్ లో జరిగే సమావేశానికి హాజరుకావాలని ఆసియా లీడర్స్ సిరిస్ ఫోరం ఆహ్వానం పంపింది. ఆసియా` యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో పెరుగుతున్న రాజకీయ అనిశ్చితులతో దెబ్బతింటున్న ప్రముఖ కంపెనీల వ్యాపార అవకాశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. మీలాంటి గౌరవనీయమైన, ప్రభావవంతమైన వ్యక్తుల మధ్య అర్థవంతమైన, ఆలోచనాత్మకమైన చర్చను నిర్వహించడం మా లక్ష్యం అని మంత్రి కేటీఆర్కు పంపిన ఆహ్వాన లేఖలో ఆసియా లీడర్స్ సిరిస్ వ్యవస్థాపకుడు కల్లమ్ ఫ్లెచర్ తెలిపారు. ఆసియా లీడర్స్ సిరిస్ నుంచి ఆహ్వానం అందడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆసియా, యూరప్ దేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
