Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మహారాష్ట్ర వ్యాపారి ఇంట్లో ఐటీ రైడ్స్… 390 కోట్లు సీజ్

మహారాష్ట్ర జాల్నాలోని ఓ వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 390 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లు ఐటీ పేర్కొంది. మహారాష్ట్రలో ఈ వ్యాపారి బట్టలు, స్టీల్ బిజినెస్ తో పాటు రియలెస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఐటీ అధికారులు తమ సోదాల సందర్భంగా 56 కోట్ల నగదుతో పాటు 32 కిలోల బంగారం, రూ.16 కోట్ల విలువైన వజ్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఇంతేకాకుండా స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

 

ఈ వ్యాపారి ఆస్తుల విలువ 390 కోట్లు వుంటుందని ఐటీ పేర్కొంది. ఆగస్టు 1 నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఐదు టీంలుగా ఏర్పడి 8వ తేదీ వరకు సోదాలు కొనసాగించింది. వ్యాపారి నివాసంలో సొమ్ము అంతగా దొరకకపోవడంతో ఫామ్ హౌస్లో సోదాలు నిర్వహించగా కప్ బోర్డులు, బెడ్ల కింద బ్యాగుల్లో నగదు లభ్యమైంది. అధికారులు సీజ్ చేసిన నగదును కౌంటింగ్ మెషీన్లతో లెక్కించడానికి దాదాపు 13 గంటల సమయం పట్టింది.

Related Posts

Latest News Updates