తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై కొత్త ఘట్టం తెరపైకి వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో నటుడు జూనియర్ ఎన్టీయార్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో వారిద్దరూ కలుసుకున్నారు. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ కలిసి విందులో పాల్గొన్నారు. అయితే… ట్రిపుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన పాత్రను చూసి అమిత్ షా ముగ్ధులయ్యారని, జూనియర్ ను అభినందించడానికే అమిత్ షా ఆయనతో సమావేశమయ్యారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే… జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించాలన్న ఆలోచన అమిత్ షా మనసులో వుందని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా… వీరిద్దరి భేటీ తెలంగాణ రాజకీయాల్లో కచ్చితంగా వేడి రగిలించే అంశమే.
మరో వైపు జూనియర్ తో భేటీ కావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్ తో ఈ రోజు కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించిందని అమిత్ షా ట్వీట్ చేశారు. ఇక… ఈ భేటీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందంచారు. జూనియర్ ఎన్టీఆర్ తో కలవడం అమిత్ షా కు సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ లో జూనియర్ నటనకు షా ఫిదా అయ్యారని బండి సంజయ్ అన్నారు.
Had a good interaction with a very talented actor and the gem of our Telugu cinema, Jr NTR in Hyderabad.
అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్తో ఈ రోజు హైదరాబాద్లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది.@tarak9999 pic.twitter.com/FyXuXCM0bZ
— Amit Shah (@AmitShah) August 21, 2022