Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

700 సంవత్సరాల తర్వాత వరంగల్ కు కాకతీయుల వారసుడు.. ఘన స్వాగతం పలికిన మంత్రులు

దాదాపు 700 ఏండ్ల తర్వాత కాకతీయుల వారసుడు ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టాడు. కమల్ చంద్ర భంజదేవ్ 7 రోజుల పాటు వరంగల్ లోనే వుండనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఇతర అధికారులు కమల్ చంద్ర భంజదేవ్ కు ఘన స్వాగతం పలికారు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం వారం రోజుల పాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహించనుంది.

 

ఈ సప్తాహం కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజదేవ్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ నెల 13 వరకూ కాకతీయ ఉత్సవాలు జరుగుతున్నాయి. కాకతీయుల పాలనా వైభవాన్ని ప్రపంచ ప్రజలకు తెలియజేసేలా ఉత్సవాలు జరుగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రజలను ఉత్తేజ పరిచేలా కళా ప్రదర్శనలు, ఫొటో ఎగ్జిబిషన్ కూడా వుంటుందని అధికారులు తెలిపారు.

Related Posts

Latest News Updates