కన్నడ సినీ దర్శకుడు ఎస్కే భగవాన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఉదయం 6 గంటలకు జయదేవ ఆసుపత్రిలో కన్నుమూశారు. భగవాన్ మృతి పట్ల కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సంతాపం తెలిపారు. జూలై 5, 1993లో జన్మించిన భగవాన్.. ‘సంధ్యరాగ’ సినిమాతో దర్శకుడిగా మారారు. తన స్నేహితుడు దొరై రాజ్తో కలిసి 55 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో ఎక్కువ సినిమాల్లో రాజ్కుమార్ హీరోగా నటించారు. ఈ జంట దొరై భగవాన్గా ఫేమస్ అయ్యారు. దొరై మరణంతో భగవాన్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కన్నడలో జేమ్స్ బాండ్ తరహా సినిమాలు తీయడంలో దిట్ట.భగవాన్ ఆదర్శ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్కి ప్రిన్సిపాల్గా ఉన్నారు.
Kannada film director SK Bhagavan passes away in Bengaluru.
"I was very saddened to hear the news of renowned director of Kannada film industry SK Bhagavan's death. I pray that God gives strength to his family to bear this pain," tweets Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/tzU7vLBkS8
— ANI (@ANI) February 20, 2023