Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఖానామెట్ లో భూములు డి రామానాయుడు, కె రాఘవేంద్ర రావు తదితరులవే! : తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ తీర్పు

రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి మండలం లో ఖానామెట్ లో దగ్గుబాటి రామానాయుడు అతని కుటుంబసభ్యులు తో పాటు దర్శకుడు కె రాఘవేంద్ర రావు, పి గోవింద్ రెడ్డి తదితరులకు చెందిన 26.16 ఎకరాల భూమికి సంబంధించిన హక్కుల వివాదంలో ఆ భూములు తమవే అంటూ ప్రభుతం దాఖలా చేసిన అప్పీలును కొట్టివేస్తూ.. రాష్ట్ర హై కోర్ట్ నిన్న 17 ఆగస్టున తీర్పు వెలువరించింది. “రామానాయుడు తదితరులు రికార్డులను తారుమారు చేసారని, మోసపూరిత రికార్డులను సృష్టించారని, ప్రభుత్వం ఎక్కడా ఆరోపణలు చేయలేదు. దీనికి సంబంధించిన రికార్డులలో ఎక్కడా ఆరోపణలు లేవు. 1961 లో అసైన్మెట్ తప్పని చెపుతున్నారు. 1963 లో మాజీ సైనికులకు భూమి కేటాయింపు కు GO వచ్చినపుడు… గతం లో చేసిన అసైన్మెట్ రద్దుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు భూమిని కేటాయించిన యాభై ఏళ్ళ తరువాత, అనుబంధ సేత్వార్ జారీ చేసిన 15 ఏళ్ళ తరువాత చర్యలు ప్రారంభించడం సరికాదు. అనుబంధ సేత్వార్ రద్దు చేయడం చెల్లదు. ఆ భూముల స్వాధీనానికి ప్రభుత్వం ప్రయత్నించరాదంటూ… సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోడానికి ఎలాంటి కారణాలు కనిపించలేదు” అంటూ న్యాయమూర్తి ఉజ్జాల్ భూయాన్, జస్టిస్ యస్. నందాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Related Posts

Latest News Updates