Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణ సీఎం కేసీఆర్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు లేఖ రాశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం భూమిని కేటాయించాలంటూ కిషన్ రెడ్డి ఆ లేఖలో కోరారు. తెలంగాణలో రోజు రోజుకీ కార్మికుల వైద్య అవసరాలు పెరిగిపోతున్నాయని, దీనిని కేంద్రం గుర్తించి.. ఈఎస్ఐ సేవలను విస్తరించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు.

రామ గుండంలోని 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన 5 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. భూమి కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని, కార్మికుల తక్షణ వైద్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. 5 ఎకరాల భూమి కేటాయించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు.

Related Posts

Latest News Updates