రాయ్గఢ్ జిల్లాలోని హరిహరేశ్వర్ బీచ్కు కొట్టుకొచ్చిన అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ బోటు వ్యవహారంలో ఉగ్రవాద కోణం లేదని తెలిపారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే పడవలో మందుగుండు సామాగ్రీ ఎందుకు ఉన్నాయో ఇప్పుడే చెప్పలేమన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందన్నారు. కొట్టుకొచ్చిన బోటు ఆస్ట్రేలియాకు చెందిన హాన్ అనే మహిళదని తెలిపారు. తన భర్త జేమ్స్ హార్బర్ట్తో కలిసి మస్కట్ మీదుగా యూరప్ వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. జూన్ 26న ఇంజిన్ ఫెయిల్ అవ్వడం వల్ల బోటు ప్రమాదానికి లోనైందన్నారు. బోట్లో ఉన్న వారిని కొరియా షిప్ రక్షించిందని పేర్కొన్నారు. అయితే ధ్వసంమైన పడవ మాత్రమ సముద్ర జలాల్లో కలిసిపోయి అలలకు రాయ్గఢ్ తీరానికి కొట్టుకు వచ్చిందన్నారు. అయినప్పటికీ ఫెస్టివల్ సీజన్ కావడంతో ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు వెల్లడిరచారు.
