Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

”మిథునం” నిర్మాత మొయిద ఆనంద రావు కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. మిథునం సినిమా నిర్మాత మొయిద ఆనంద రావు (57) కన్నుమూశారు. మధుమేహంతో చాలా కాలం నుంచి బాధపడుతున్న ఆనంద రావు… కొన్ని రోజులుగా వైజాగ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి బాగా విషమించడంతో కన్నుమూశారు. ఆనంద రావుకి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు వున్నాడు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం స్వస్థల వావిలవలసలో జరగనున్నాయి. మొయిద ఆనందరావు సీతారాంపురం దగ్గర, వావిలవలస అనే చిన్న గ్రామం లో పుట్టాడు. ఒక ప్రైవేట్ కంపెనీ లో చిన్న ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు.

Related Posts

Latest News Updates