మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ పనికి పూనుకోవాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో రెండు సార్లు హామీ ఇచ్చి మాట తప్పుతుందని విమర్శించారు.
27 years and counting, when will the women of our country be given their fair share of representation in the legislative discourse?
Join us at Jantar Mantar, New Delhi on 10th of March if you believe that Women’s Reservation Bill is the need of the hour, like we do! pic.twitter.com/ahimK1okBi
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 2, 2023
కేంద్ర వ్యవహార శైలిని నిరసిస్తూ… ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 10 న ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ దీక్షకు అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. మార్చి 13 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి.. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు.