Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

దురుద్దేశంతోనే కన్నా వ్యాఖ్యలు… గట్టిగా కౌంటర్ ఇచ్చిన జీవీఎల్

మాజీ మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేసేశారు. ఇక తాను పార్టీలో పొసగలేనంటూ స్పష్టం చేశారు. అయితే… పోతూ పోతూ సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ పై విమర్శలు చేస్తూ వెళ్లారు. దీనిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు స్పందించారు. దురుద్దేశంతోనే కన్నా లక్ష్మీ నారాయణ తనపై విమర్శలు చేశారన్నారు. అధిష్ఠానం చెప్పిన విధంగానే సోము వీర్రాజు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా సోము వీర్రాజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోరన్నారు.

 

కన్నాకి బీజేపీ సముచిత గౌరవం ఇచ్చిందని, ఏపీ అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని, అందుకే రాజీనామా ప్రకటన చేశారన్నారు. గతంలోనూ సోము వీర్రాజుపై కన్నా కామెంట్స్ చేశారని గుర్తు చేశారు. బయట పార్టీ నుంచి వచ్చిన కన్నాకి నేరుగా అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఎప్పుడూ లేదని, కానీ… కన్నాను పార్టీ ఏపీ అధ్యక్షునిగా చేసిందని జీవీఎల్ పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates